విశాఖ: మధురవాడ ఐటీ సెజ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా మృతి చెందిన యువకుడి మృతదేహన్ని స్థానికులు సోమవారం గుర్తించారు. సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతి చెందిన యువకుడు మణికంఠ (34)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.