PLD: నూజెండ్ల మండలంలో నలుగురు దొంగలను ఐనఓలు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు వివరాల మేరకు.. పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులోని కాపర్ వైర్లు దొంగిలించి అమ్ముకుంటున్న నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని చెప్పారు. వారి వద్ద నుంచి 350 కేజీల కాపర్ స్వాధీనం చేసుకున్నారు.