NTR: వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ గౌస్ మొహీద్దిన్ విజయవాడ బ్రాహ్మణ వీధిలోని పశ్చిమ వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గౌస్ మొహీద్దిన్ను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు.