కృష్ణా: నాగుల చవితి సందర్భంగా మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి శనివారం ఒక్కరోజులో వివిధ సేవల టిక్కెట్ల ద్వారా రూ.5,40,893 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో వివరించారు.