NLR: జిల్లా కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ ఆనంద్ నిర్వహించారు. అర్జీదారుల నుండి అర్జీలు కలెక్టర్ ఆనంద్ స్వీకరించారు. ఉదయం 9 గంటలకే అర్జీదారులు బారులు తీరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, డీఆర్వో ఉదయ భాస్కర్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.