W.G నరసాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను టీడీపీ నరసాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు ఆర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడం, వాటిని తక్షణం పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం లక్ష్యంగా ఈ వేదిక ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.