బాపట్ల: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చందోలు ఎస్సై మర్రి వెంకట శివకుమార్ ఎన్ హెచ్ 216పై సోమవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వాహన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని వారికి చలానాలు విధించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వాహనదారులకు వివరించారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.