కృష్ణా: పామర్రు మండలం కొమరవోలు మేజర్ డ్రెయిన్ వద్ద పూడికతీత పనులను మంగళవారం ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ భూములకు సాగునీరు చేరే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనతో కలిసి పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.