అన్నమయ్య: రామసముద్రం మండలం పెద్దకురపల్లి పంచాయితీ మట్లవారిపల్లి జడ్పీ హైస్కూల్లో ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలను హెచ్ఎం బాలసుబ్రమణ్యం నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.