KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని రేకలకుంట పంచాయతీ పరిధి డి.అగ్రహారం గ్రామంలో 340 మీటర్ల సిసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ మేరకు 15 లక్షల వ్యయంతో నిర్మించబడుతున్న ఈ రహదారి పనులను మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు, మండల అధ్యక్షులు చెన్నుపల్లె సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కనాల మల్లికార్జున, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.