E.G: రాజానగరం(మం) రఘుదేవపురంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ‘మన ఊరు-మన ఎమ్మెల్యే-మన పల్లెబాట’ కార్యక్రమంలో భాగంగా శనివారం పర్యటించారు. అనంతరం కూటమి నాయకులలతో కలిసి ప్రతీ ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల వద్ద నుంచి అందుకున్న అర్జీలను విశితంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.