VZM: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని రూరల్ సీఐ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్దానిక జమ్మూ, నారాయణపురం, పడాల పేట గ్రామాలలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులను పట్టుకొని వారి నుంచి మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మద్యం సేవిస్తూ జీవితాలను పాడు చేసుకోవద్దని వారిని హెచ్చరించారు.