W.G: చిత్తూరు జిల్లా వి.కోటలో రిపోర్టర్ జగన్ మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ ఆచంటలో ఇవాళ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిస్టులపై దాడులు పెరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.