VZM: మార్కెట్లో జరుగుతున్న కల్తీలు, మోసాలు, అబద్ధపు ప్రకటనల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజ్లో వినియోగదారుల చైతన్య సదస్సును బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భీశెట్టి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా యువత చైతన్యవంతమైన వినియోగదారులుగా మారాలన్నారు.