ASR: చింతపల్లి ఏరియా ఆసుపత్రి సమస్యలను వైద్య ఆరోగ్య కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని గిరిజన ఉద్యోగ సంఘం జాతీయ అధ్యక్షుడు పీవీ రమణ తెలిపారు. ఏరియా ఆసుపత్రిని శనివారం ఆయన సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.