శ్రీకాకుళం విలీన పంచాయతీ తోటపాలెంలోని డోలపేట గ్రామానికి రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరారు. జెడ్పీలో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో సోమవారం అధికారులకు వినతి పత్రం అందజేశారు. జాతీయ రహదారి నుంచి గ్రామం వరకు ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేయాలని సూచించారు. రోడ్డు పూర్తిగా పాడైందని చెప్పారు. అనేక సార్లు అధికారులు దృష్టికి సమస్య తీసుకువెళ్లినట్లు వివరించారు.