NLR: గుడ్లూరు మండల కేంద్రంలో మంగళవారం రాత్రి నేషనల్ హైవేపై దారుణం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఓ కంటైనర్ వాహనం గొర్రెల మందను ఢీ కొట్టడంతో 50కి పైగా గొర్రెలు మృతి చెందాయని స్థానికులు తెలిపారు. మోచర్ల-వీరేపల్లి గ్రామాల మధ్య గొర్రెల మందను నేషనల్ హైవేపై క్రాస్ చేయిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వివరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.