కృష్ణా: శాంతినగర్లో మంగళవారం మహిళా పోలీస్ అధికారి మల్లెల విజయలక్ష్మి, ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో ‘బేటి బచావో బేటి పడావో’ అవగాహన ర్యాలీ జరిగింది. విజయలక్ష్మి మాట్లాడుతూ.. క్రమశిక్షణ, మంచి నడవడికతో బాలికలు చదువుకోవాలన్నారు. సోషల్ మీడియా ఆకర్షణకు గురికావొద్దని సూచించారు. బాలికల ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందన్నారు.