KDP: వల్లూరు(మం) పుష్పగిరి వద్ద పెన్నా నదిలో ముగ్గురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. కడపకు చెందిన హర్షవర్ధన్ (22), హరిబాబు (25) మృతదేహాలు ఆదివారమే వెలికితీశారు. అయితే, ఐటీ సర్కిల్ వాసి కృష్ణ చైతన్య (20) కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. పోలీస్, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి సోమవారం ఉదయం చైతన్య మృతదేహాన్ని నదిలో నుంచి బయటికి తీశారు.