కృష్ణా: హైదరాబాద్లో సోమవారం నుంచి 22వ తేదీ వరకు జాతీయస్థాయి సబ్ జూనియర్ U/14 పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాస్కెట్ బాల్ జట్టులో కృష్ణా జిల్లాకు చెందిన క్రీడాకారులు ఎంపికైనట్లు సీనియర్ కోచ్ డాక్టర్ వాకా నాగరాజు తెలిపారు. నూజివీడులో ఆయన శనివారం రాత్రి మాట్లాడుతూ.. క్రీడాకారులు కుసుమ, వాహిని, వర్షిని, మనోబిరామ్ ఎంపికైనట్లు తెలిపారు.