KRNL: పెద్దకడబురు (మం) కల్లుకుంటలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని CPM మండల కార్యదర్శి తిక్కన్న డిమాండ్ చేశారు. ఇవాళ MPDO ప్రభావతి దేవికి వినతిపత్రం అందజేశారు. 6000 వేల జనాభా కలిగిన గ్రామంలో 15 రోజులకు ఒకసారి తాగునీరు వదులుతున్నారని వాపోయారు. మూడు ఓవర్ హెడ్ ట్యాంకులకు ఒకే పైపులైన్ ఉండడం వల్ల తాగునీటి సమస్య మరింత తీవ్రతరం అవుతుందని పేర్కొన్నారు.