ATP: కూడేరు సచివాలయం వద్ద నేడు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ మహబూబ్ బాషా ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామస్థాయిలో భూ సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.