కడప: కమలాపురం పట్టణంలోని శిరీష శ్రీసాయి ఆసుపత్రిలో అనంతరంకు చెందిన కిమ్స్ సవేరా ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. గుండె జబ్బులు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.