SKLM: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం పేద ముస్లింలకు రంజాన్ తోఫాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సనపల అన్నాజీరావు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినం సహనానికి, సేవా భావానికి ప్రతీక అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మైనారిటీల సంక్షేమానికి అండగా ఉంటుందని అన్నారు.