W.G: ఉండి మండలం, వాండ్రం గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా సగంపైగా పూడిపోయి ఉన్న మంచినీటి చెరువును బాగు చేసి, చెరువు చుట్టూ చక్కని వాకింగ్ ట్రాక్ వేశారు. దీనిని సోమవారం శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. దాదాపు దశాబ్ద కాలంగా ఉన్న మంచి నీటి కొరత నేటితో తీరనుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.