SKLM: పోలాకి, గార నడుమ వంశధార నదిపై నిర్మిస్తున్న వంతెన పనులు నిలిచిపోయాయి.తీరప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు2018లో రూ.72కోట్లతో అప్పటి నేటి టీడీపీ ప్రభుత్వం వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.17 పిల్లర్ల నిర్మాణం కూడా పూర్తయింది. నేటికీ ఏడు సంవత్సరాలకు పైగా అయినా పనులు ముందుకు సాగకపోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.