ATP: ఆర్డీటీ సంస్థ పరిరక్షణ కోసం మాజీ ఎంపీ తలారి రంగయ్య చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. మూడో రోజు కళ్యాణదుర్గం(M) బొమ్మగానిపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర రాయలదొడ్డి, కన్నేపల్లి, ముద్దలాపురం, పిల్లలపల్లి, గొంచిరెడ్డిపల్లి, సూగేపల్లి వరకు కొనసాగింది. RDT సంస్థకు FCRA రెన్యూవల్ చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రంగయ్య విమర్శించారు.