కోనసీమ: అమలాపురం కోర్టుల సముదాయంలో శనివారం జరిగిన లోక్ అదాలత్లో రూ.17 కోట్ల 93 లక్షల విలువైన 126 కేసులు పరిష్కారం అయ్యాయి. అమలాపురం జిల్లా రెండో అదనపు కోర్టులో న్యాయమూర్తి వి.నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ లోక్ అదాలత్లో కక్షిదారులు రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకున్నారు. పరిష్కారమైన 126 కేసుల్లో 56 సివిల్ కేసులు, 23 బ్యాంక్ కేసులు ఉన్నాయన్నారు.