VZM: గంట్యాడ మండల కేంద్రంలో గల శ్రీనివాస, కనకదుర్గ రైస్ మిల్లులను శనివారం జేసి సేతు మాధవన్ సందర్శించి తనిఖీలు చేపట్టారు. మిల్లులో రికార్డులను పరిశీలించారు. రైతుల నుండి ధాన్యం సేకరణ ప్రక్రియను పరిశీలించారు. మిల్లు యజమానులు ధాన్యం తూకం విషయంలో అక్రమాలు చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు మిల్లును తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు.