కృష్ణా: ప్రభుత్వ పాఠశాలల్లోని స్వీపర్లకు పెండింగ్లో ఉన్న 6 నెలల వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీటీయూ ఆధ్వర్యంలో సోమవారం నూజివీడులోని సబ్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో వాణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు హరినాథ్, పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు.