ప్రకాశం: ఒంగోలులో కలెక్టరేట్ కార్యాలయంలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ రాజా బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరవుతారని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.