KRNL: మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి మంగళవారం తన స్వగృహంలో యోగాసనాలు చేశారు. ఈనెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ యోగాసనాలు చేపట్టామన్నారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుందని ఆయన తెలిపారు.