W.G: మిల్లర్ల నుండి నాణ్యమైన గోనె సంచులను సేకరించి రైతులకు అందించేందుకు ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలని జేసీ రాహుల్ కుమార్ అన్నారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు అధికారులు సన్నద్ధం కావాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో మండలాల వారీగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జేసీ అన్నారు.