కోనసీమ: ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల శిథిలావస్థకు చేరుకొని 20 సంవత్సరాలు దాటిందని, వెంటనే నూతన భవనం నిర్మించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ అంశంపై సోమవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కాలేజీ ఎదుట విద్యార్ధులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. జిల్లా అధ్యక్షులు వెంకట్ మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న ఈ ప్రభుత్వ కళాశాలను కాపాడుకోవాలని అన్నారు.