సత్యసాయి: కలెక్టర్ టీఎస్ చేతన్ సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఇంధన పరిరక్షణపై రూపొందించిన గోడ పత్రికలు, కరపత్రాల ప్రచార సామగ్రిని ఆవిష్కరించారు. రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్, ఇంధన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఆర్ఏ విజయ సారధి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులు పాల్గొన్నారు.