PLD: రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామంలోని శ్రీ స్వయంభు మత్స్యావతార వెంకటేశ్వర స్వామివారి తిరుణాల మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ , ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందారు.