అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షులు పునీత్ మంగళవారం ఫిర్యాదు చేశారు. మదనపల్లెలో మాదకద్రవ్యాల వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోందని, యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న వ్యాపారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. యువతలో చైతన్యం తీసుకువచ్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.