NLR: బుచ్చి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 7వ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవో శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతున్నాయి