ATP: బహిరంగంగా మద్యం సేవించడం నిషేధమని, చట్టరీత్యా నేరమని జిల్లా ఎస్పీ జగదీశ్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా శాంతికి భంగం కలిగించిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 85 కేసులు నమోదు చేశామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహన చోదకులపై 10కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిని ఉపేక్షించేది లేదన్నారు.