GNTR: తమకు మంచినీటిని అందజేయాలని ప్రత్తిపాడు జగనన్న కాలనీ వాసులు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. తమ కాలనీకి గత వారం రోజులు నుండి మంచి నీరు రాక ఇబ్బందులు పడుతున్నామని ఖాళీ బిందెలు చూపిస్తూ నిరసన తెలిపారు. ఈ సమస్యపై గతంలో అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని కోరారు.