GNTR: గ్రామాలలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు, వివాదాలు పరిష్కరించటమే రెవెన్యూ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశమని రేపల్లె తహశీల్దార్ మోర్ల శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం రేపల్లె మండలంలోని సింగుపాలెం, నల్లూరుపాలెం గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని ఆన్ లైన్లో నమోదు చేసి పరిష్కారం చేస్తామన్నారు.