ASR: పెదబయలు మండలం బొంగరం గ్రామపంచాయతీ పరిధిలో ఈరోజు సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడింది. ఈరోజు శ్రీ రాసకొండ చెల్లెమ్మ తల్లి పండగను పురస్కరించుకొని, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. అనంతరం భక్తులు తిరుగు ప్రయాణ సమయంలో గాలి, వడగళ్లతో భారీ వర్షం పడడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు.