CTR: బగుడుపల్లి మండలం యామిగానిపల్లి పంచాయతీలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కుప్పం ఆర్డీవో శ్రీనివాసరాజు, తహసీల్దార్ సీతారాం పాల్గొన్నారు. రైతులు, ప్రజల నుంచి భూ సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని ఆర్డీవో స్పష్టం చేశారు. రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.