W.G: కూటమి ప్రభుత్వం తీసుకున్న ఉచిత బస్ నిర్ణయంతో ఆటో డ్రైవర్ కుటుంబాలు ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని, ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని భీమవరం ఆటో యూనియన్ నాయకులు కోరారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ఏపీ ఆటో యూనియన్, ఐక్య సంఘాల సభ్యులు పాల్గొన్నారు.