KRNL: సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ రుద్రగౌడ్పై చర్యలు తీసుకోవాలని కురువ కార్పొరేషన్ ఛైర్మన్ మాన్వి దేవేంద్రప్ప శుక్రవారం ఇన్ఛార్జ్ ఆర్డీవో అజయ్కు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో రేషన్ సరఫరాలో నిర్లక్ష్యం, అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హామీ ఇచ్చారు.