ప్రకాశం: మార్కాపురం ఏమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పట్టణంలో 15వ వార్డులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొని వీధులను మున్సిపల్ సిబ్బందితో కలిసి శుభ్రపరిచారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, మున్సిపల్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.