SKLM: శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం స్థానిక అసిరి తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అరసవల్లి పండుగను అత్యంత వైభవంగా ఎమ్మెల్యే నిర్వహించాలన్నారు. అనంతరం అరసవల్లికి అనుసంధానంగా ఉన్న రోడ్లను ఆయన పరిశీలించారు. పాడైన రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.