KDP: జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుతో టీడీపీ ఎమ్మెల్యేకు షాక్ తగిలింది. అప్పు చెల్లించడంలో విఫలమైన కారణంగా ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ తీర్పు కేవలం ఎమ్మెల్యేకే కాకుండా ఆయన కుమారుడు కొండారెడ్డికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఓ కంపెనీ నుంచి అప్పు తీసుకొని చెల్లించకపోవడంతో తీర్పు వెల్లడించింది.