ASR: గత వైసీపీ పాలనలో రేషన్ సరుకులు ఇంటింటికీ వెళ్లి ఇవ్వడం జరిగిందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. అలా ఇస్తే దోచుకునేందుకు వీలు కాలేదని కూటమి నేతలు భావించి, ఆ పథకాన్ని ఎత్తివేసారని విమర్శించారు. అరకులో బుధవారం జరిగిన వెన్నుపోటు దినంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారని, ఆ పథకం కూడా అమలు కావడం లేదన్నారు.