NTR: రబీలో పండిన ధాన్యాన్ని మద్దతు ధర ప్రకారం వెంటనే కొనుగోలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలులో ఆయన పర్యటించారు. రైతులతో మాట్లాడి ధాన్యం అమ్ముకోవడంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రబీలో ధాన్యానికి మద్దతు ధర దక్కడంలేదని రైతులు వాపోయారు.